శనివారం శనిబాధలు తొలగిపోవాలంటే.. ఆ పండ్లను నైవేద్యంగా పెట్టాలి..

-

అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో శని ఉంటే అంతే అనే నానుడి గుర్తే ఉంది కదూ..అలా మనం ఎంత సంపాదిస్తున్నా కూడా శని ప్రభావం మనమీద ఉంటే అంతే..చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు..శనిబాధల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని పూజలు చెయ్యాలి..కొన్నిటిని దానం చెయ్యాలి.ముఖ్యంగా నేరేడు పండ్లను దానం చెయ్యడం వల్ల శని భాదలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని పండితులు చెబుతున్నారు.

దీర్ఘకాల వ్యాధులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారి రోగ నిరోధక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్లు చేస్తాడు. దీని నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ గర్భిణీలు వీటిని అస్సలు తినకూడదు. ఈ నేరేడు పండ్లను శనివారం తీసుకోవడం ద్వారా మధుమేహం దరిచేరదు. అలాగే పొట్టలోని వెంట్రుకలు, మలినాలు తొలగిపోతాయి.

శరీరానికి ఇవి చలవ చేస్తాయి. దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. జబ్బులు తగ్గిపోతాయి. ఆరోగ్యవంతులవుతారు.నేరేడు పండ్లను శనివారం శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి తగ్గిపోతాయి. నల్ల నేరుడును, నువ్వులతో కలిపి శనివారం దానం చేస్తే.. శనిబాధలుండవు…దరిద్రం ఉండదని జ్యోతిష్య పండితులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news