నవగ్రహదోషాలు పోవాలంటే ఈ పనిచేయండి!

-

ఉద్యోగాలు రావట్లేదు.. నవగ్రహదోషం. పెండ్లికావట్లేదు నవగ్రహ దోషం. సంతానం కావట్లేదు.. నవగ్రహదోషం. ఇలా అనేక సమస్యలకు ప్రధానకారణంగా మనకు జ్యోతిషులు చెప్పేది నవగ్రహదోషాలు. అయితే చాలామందికి ఖర్చుతో కూడుకున్న నవగ్రహ జపాలు,శాంతి, హోమాలు, దానాలు సాధ్యం కాదు. మరి ఎలా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అనేది లక్షలాదిమంది అనుమానం. అయితే పలు పురాణాల్లో, శాస్ర్తాల్లో, అనుభవజ్ఞుల జీవితంలో ఆచరించిన పలు చిన్నచిన్న క్రియలు నవగ్రహదోషాలను తొలగిస్తాయి. ఆ పరంపంరలోనే భాగంగా.. ఈ రోజు నవగ్రహ దోషం పోవాలంటే అత్యంత సులభమైన ఉపాయం.. ఆచరణ సాధ్యమైయ్యే ఒకదాన్ని నేడు తెలుసుకుందాం…

నవగ్రహదోషాలు: జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన సులభోపాయాన్ని చూద్దాం..
గోవు అంటే దేశీయ ఆవు ద్వారా మనకు నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారు. సప్తరుషులు,నదలు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదల్లోనూ ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. అయితే గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో, ఇష్టదేవతానామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పక నవగ్రహదోషాలు పోతాయి.

అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి ప్రధానం,మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ,గోదానం, గోసేవ చేసుకోండి తప్పక విశేష ఫలితాలు లభిస్తాయి. గోవుకు సంబంధించిన పలు విషయాలను అనుశాసన పర్వంలో వ్యాసుడు పలు విషయాలను వివరించారు. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడండి. వీలైతే గోవులు నడిచిపోయిన వెంటనే ఆ మట్టిని కొంత సేకరించి మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా కొంచెం పెట్టుకోండి. మీ నవగ్రహదోషాలు అన్ని పోతాయి. మీ కార్యాలు పూర్తవుతాయి. ఓం శ్రీకృష్ణనాయనమః

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news