చాలా మందికి తెలియని ద్వారకా తిరుమల పుణ్యక్షేత్ర విశేషాలు..!

-

ఆపద మొక్కులవాడు ,అనాధ రక్షకుడు,వడ్డీ కాసుల వాడు, శ్రీ వేంకటా చలపతి అయిన కలియుగ దైవం శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వేంచేసియున్న ద్వారక తిరుమల ఎంతో పవిత్ర పుణ్య క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కి 42 కి.మీ దూరంలో గల ద్వారకా తిరుమల ఎంతో పవిత్ర పుణ్య క్షేత్రం.

పూర్వం ద్వారక మహర్షి అనే ముని ఇక్కడ తిరుమల వేంకటేశుని గురించి తపస్సు చేసి ఆ దేవాతిదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడట, కోరిన కోర్కెలు తీర్చే ఆ స్వామి మహర్షికి దర్శనము ఇచ్చి ఏమి కావాలో అడగగా ఆ మహర్షి నీ పాద సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకున్నడట,అందుకే స్వామి అక్కడ వెలసినట్లు పురాణ గాథ.

అయితే ఇక్కడ ఒకే గోపురం కింద రెండు మూలవిరాట్టు విగ్రహాలు ఉండటం విశేషం.ద్వారకా మునికి ప్రత్యక్షమైన విరాట్టు వక్ష స్థలం వరకు మాత్రమే దర్శనమిస్తుంది.స్వామి పాదాలు పాతాళంలో ఉన్నాయి అని నమ్మిక. అందుకే శ్రీ రామానుజాచార్యులు వారు స్వామి ని దర్శించుకున్నపుడు స్వామి వారి పెద్ద విరాట్టు చేశారు. మహర్షి కి దర్శనము ఇచ్చి న విరాట్టు ని మొక్కితే కోరిన కోర్కెలు తీరతాయని ,ప్రతిష్ట చేసిన విరాట్టు ని కొలిస్తే ధర్మార్త మొక్షా లు కలుగుతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

ఇక్కడ స్వామికి సంవత్సరానికి రెండు సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి.ఈ స్వామి కి ఒక్కసారి కూడా అభిషేకాలు జరగకపోవడం విశేషం,ఎందుకంటే మూల విరాట్టు కింద భాగంలో ఉన్న ఎర్ర చీమలు చెదిరి విగ్రహం నిండా అవుతాయని అభిషేకం చేయరు.పెద్ద తిరుపతిలో మొక్కులైనా అక్కడకు వెళ్ళే స్థోమత లేనివారు ఈ ద్వారకా తిరుమలలో చెల్లించ వచ్చు. ఇక్కడ సంవత్సరం పొడవునా భక్తులు వచ్చి గోవిందా గోవిందా అని స్వామి ని చూసి తరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news