వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి..? దీని వెనుక ఉన్న వాస్తవాలు ఇవే..!

-

దేవుడని పూజించి మళ్లీ ఎందుకు నీళ్లలో వేసేస్తారు. ఈ వినాయకుడికి మాత్రమే పాపం ఎందుకు ఇలా..? ఆ గణనాథుడి విగ్రహం ఇంటికి తెచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అది నిమజ్జనం చేసేప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా..? మీరు చూసే ఉంటారు చాలా మంది.. నిమజ్జనం చేసేప్పుడు విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తారు. విగ్రహం పెట్టినప్పటి నుంచి 3, 9,11 రోజులకు నిమజ్జనం చేస్తారు. అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి..? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి..?

గణేశ జన్మ చక్రాన్ని సూచించడానికి నిమజ్జనం చేస్తారు. అంటే అతను మట్టి నుండి సృష్టించింది పార్వతి. అందుకే తిరిగి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. గణేశ చతుర్థి ఆచారాలు నిర్వహించబడే భక్తుల ఇంటిలో లేదా ఆలయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత గణేశుడు తన ఇంటికి తిరిగి వెళ్తాడు. 10 రోజుల పూజల తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.

సాధారణంగా వినాయకుడికి పూజలు పూవు పత్రితో చేస్తారు. నిమజ్జనం సమయంలో వీటితోపాటు వినాయక ప్రతిమను కూడా నిమజ్జనం చేస్తారు. అపుడు నీటిలో ఉండే క్రిమికీటకాలు శుద్ధిగా అయిపోతాయి. వీటితో ఏ అనారోగ్య సమస్యలు రావు. కానీ, ప్రస్తుతం ఈ వినాయకుడి విగ్రహాలను అనేక రసాయనాలతో తయారు చేస్తున్నారు. ఇటువంటి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు అపరిశుభ్రం అయిపోతుంది. వీటితో జలచరాలకు సైతం ముప్పు వాటిల్లుతుంది. కేవలం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని మాత్రమే ఉపయోగిస్తే వాతావరణానికి సైతం ఏ హానీ కలుగదు.

ఈ వినాయక నిమజ్జనం వెనుక మరొక చరిత్ర ఉంది. కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు దైవత్వం ఉంటుందని అంటారు. ఆ తర్వాత వాటికి పూజలు చేసినప్పటికీ ఏ విధమైన దైవశక్తి ఉండదు. అందుకే తొమ్మిది రోజుల తర్వాత ఇలా నీటిలో నిమజ్జనం చేస్తారు. కేవలం వినాయక ప్రతిమను మాత్రమే కాదు, దేవీనవరాత్రుల తర్వాత అమ్మవారి ప్రతిమలను కూడా ఇదేవిధంగా నిమజ్జనం చేస్తారు.

ఇంకా మనకు వినాయకుడి గురించి తెలియని నిజాలు ఉన్నాయి. వినాయకుడికి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి అంటారు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి, ఇద్దరు పిల్లలు శుభ్, లాభ్‌. ఒకరోజు వినాయకుడు తపస్సు చేస్తుంటే.. తులసీ మాత ఆయన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని కోరుతుంది. దానికి ఆయన తిరస్కరిస్తాడు. దీంతో ఆమె నిన్ను త్వరలో పెళ్లి చేసుకుంటానని అంటుంది. వెంటనే వినాయకుడు నీవు మొక్కగా మారిపోదువు అని శపిస్తాడట. అదే ఇప్పుడు మనం ప్రస్తుతం పూజ చేస్తున్న తులసీ మొక్క. అందుకే వినాయకుడికి అన్నీ పూలు పత్రాలతో పూజ చేస్తారు కానీ, తులసీ ఆకులతో చేయరు.

Read more RELATED
Recommended to you

Latest news