పెళ్లికాని అమ్మాయిలు గోదాదేవి కథను చదివితే పెళ్లి అవుతుందా?

-

కొన్ని దోషాల వల్లే పెళ్ళిళ్ళు ఆగి పోతున్నాయని నిపుణులు అంటున్నారు..వాళ్ళకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా సెట్ అవ్వవు..అలాంటి యువతులు కొన్ని పూజలను ప్రత్యేకంగా చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా దేవి మానవులకు కాక దేవుడైన రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు..వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామి వారికి పంపించసాగినది. ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణు చిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామి వారికి మాలాధారణ కావించరు.

ఇదంతా తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామి వారు విష్ణు చిత్తులతో అదేమీ లేదనీ,ప్రతి రోజూ తనకు గోదా దేవి ధరించిన మాల ధారణే కావాలని ఆదేశిస్తారు.ఈ విషయాలు ఏవి తెలియని అమ్మవారు..ధనుర్మాసంలో వేకువనే నిద్ర లేచి విష్ణు పూజ చేసి, తన అనుభవాల్నీ, భావాన్ని ఒక గేయం అంటే పాశురం రూపంలో రచించేది. ఇలా ప్రతి రోజు ఒక పాశురం చొప్పున 30 పాశురాలను రచించి వాటిని విష్ణువుకు ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మనుట, ఆమె తండ్రిని తీసుకొని శ్రీరంగం వెళ్ళుట, శ్రీరంగంలో రంగనాథ స్వామితో వివాహం జరుగుట, వివాహం తరువాత గోదా దేవి రంగనాథునిలో ఐక్యం చెందుటతో కథ ముగుస్తుంది.. అందుకే పెళ్లికానీ యువతి, యువకులు అమ్మవారి తిరుప్పావైను పారాయణం చేయటం వల్ల వెంటనే పెళ్లి కుదురుతుంది.తమ కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news