కరీంనగర్ : బండి సంజయ్ ఫిర్యాదు.. ఉన్నత అధికారులకు నోటీసులు

-

తెలంగాణ CS సోమేశ్ కుమార్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి‌ రవి గుప్తాలతో పాటుగా మరికొందరు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. కరీంనగర్ MP బండి సంజయ్‌ ఫిర్యాదుపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. DGP మహేందర్‌ రెడ్డి, CP సత్యనారాయణ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్‌కు కమిటీ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news