ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో రియల్టర్‌లపై కాల్పులు.. ఒకరు మృతి

-

ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధి కర్ణంగుడాలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగుడా సమీపంలో రియల్టర్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి మరణించగా, మరో రియల్టర్ రాఘవేందర్ గాయపడ్డారు. వెంటనే ఆయనను బీఎన్ రెడ్డినగర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థిరాస్తి గొడవలే దీనికి కారణంగా తెలుస్తోంది.. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు రియల్టర్లు హైదరాబాద్ కు చెందిన వారుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news