సంగారెడ్డి: ఐఐటీకి రూ.300 కోట్లు కేటాయింపు

-

సంగారెడ్డి జిల్లా కంది శివారులో ఉన్న హైదరాబాద్‌ ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.300కోట్లు కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌ ఐఐటీకి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.ఈ నిధులు ఐఐటీని అభివృద్ధి చేయడంతో పాటూ పరిశోధన, విద్యార్థుల నైపుణ్యతను మెరుగు పరచడానికి వినియోగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news