మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పులను కలిసిన మంత్రి

-

పరిగి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డిని ఆయన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం వారు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news