మెదక్ : కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

-

జోగిపేట్ మున్సిపాలిటీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కోరారు. చిన్న మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధి కోసం వనరులు సమకూర్చుకోవడం ఇబ్బందికరంగా ఉందని, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే అభివృద్ధి సులువుగా జరుగుతుందని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news