
యాదాద్రి: ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం వచ్చిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా భక్తులు వివిధ రూపాల్లో ప్రధాన బుకింగ్, సువర్ణ పుష్పార్చన, రూ.100 దర్శనం, నిత్య కళ్యాణం, కళ్యాణ కట్ట, అన్నదానం విరాళాలు, వేద ఆశీర్వచనం, సుప్రభాత సేవ, వాహన పూజ, యాదఋషి నిలయం, పాత గుట్ట ద్వారా స్వామివారి ఖజానాకు రూ. 10,16,826 ఆదాయం వచ్చిందన్నారు.