దొంగల బీభత్సం.. ఆభరణాలు మాయం

-

దుండిగల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన గడ్డ సిరాజ్ ఇంట్లో ఈ నెల 9వ తేదీ రాత్రి దొంగలు పడి ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. సోమవారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news