దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.. దానికి కారణం కేసీఆరే- ఈటెల రాజేందర్

-

దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని.. దానికి కారణం సీఎం కేసీఆరే అని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మహబూబ్ నగర్ లో బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం కోసం బీజేపీ నేతలను రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విమర్శించే కన్నా ముందుగా మీరు చేయాల్సింది జీవో 124 నుంచి స్థానికత ఆధారంగా ఉద్యోగులను సవరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కుంభకర్ణుడిలా నిద్ర పోతూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు.

అనాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్నవారు ఉద్యోగులు, టీచర్లు కాదా.. ముఖ్యమంత్రి గారూ మరిచిపోయారా అంటూ.. ప్రశ్నించారు. బీజేపీ నాయకులు వద్దకు తమ సమస్యలు చెబితే ట్రాన్ఫర్లు చేస్తున్నారు. దరఖాస్తు ఇస్తే సస్పెండ్ చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఉద్యోగులు కర్రు కాల్చి వాత పెడుతారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతరేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ నిరసన తెలిపితే.. కార్యకర్తలను గొడ్లను కొట్టినట్లు కొడుతున్నారని.. ఎంపీ బండి సంజయ్ నిరసన తెలిపితే… సీపీ ఎం చేశారో అందరూ చూశారని ఆయన అన్నారు. మీది బుడ్డ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. మాది 303 సీట్లు గెలిచి దేశంలో అధికారంలో ఉన్నామని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని టీఆర్ఎస్ పార్టీకి గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news