హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండుగ నేపథ్యంలో జనాలు తమ పిల్లలను తీసుకొని పట్నం వదిలి పల్లె బాట పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు బారులు తీరాయి. రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో రహదారిపై దట్టమైన పొగమంచు ఏర్పడింది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళుతున్నారు. నేడు, రేపు రద్దీ పెరిగే అవకాశం ఉంది.
వాహనాలతో కిక్కిరిసిన నేషనల్ హైవే
By Naga Babu
-
Previous article
Next article