ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌..

-

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్ర‌మంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు సమాచారం. సుమారు 1,94,592 లక్షల పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేట్ చేసింది. అయితే ఇందులో 1,84,944 మంది అభ్యర్థులు విధుల్లో చేరారు, మిగిలిన 9,648 పోస్టులు మిగిలి ఉన్నాయి.

ఇక మిగిలిన పోస్టులకు నియామకాలు జరుగుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా , శ్రీకాకుళంలో అత్యల్ప ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ అక్టోబర్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version