లోక్‌సభ ఎన్నికలతో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రీషెడ్యూల్.. !

-

ఏప్రిల్, మే నెలలో దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో లోక్‌సభ ఎన్నికలను సీఈసీ ప్రకటించింది. దీంతో అనేక పరీక్షల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఎగ్జామ్ జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-జేఈఈ విభాగం ప్రకటించింది.

JEE main exam reschedule due to loksabha elections

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో జరుగనున్నాయి.

దీంతో జేఈఈ మెయిన్ ఏప్రిల్ 2019ను మొదట ప్రకటించినట్లు ఏప్రిల్ 6-20 మధ్య కాకుండా 7-20 తేదీల మధ్య నిర్వహించనున్నారు.

పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) కోసం నిర్వహించే తేదీలను ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించనున్నారు.

పేపర్-1 (బీఈ/బీటెక్) కోసం నిర్వహించే పరీక్షను 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.

పూర్తి సమాచారం కోసం https://jeemain.nic.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

నోట్- తెలంగాణ, ఏపీలలో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news