పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ లో భాగంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకి స్త్రీ, పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఏపి మరియు టీఎస్ కి చెందిన వారు ఇద్దరు కూడా అర్హులే. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇక అర్హతల వివరాలను చూస్తే.. పోస్టుల్ని అనుసరించి సీఏ / సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కుల తో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ (ఫైనాన్స్)/ పీజీడీఎం ( ఫైనాన్స్ ) / తత్సమాన పీజీ డిగ్రీ ( ఫైనాన్స్ ) ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. 37 ఏళ్ల వయస్సు మించరాదు. అలానే అప్లై చేసుకోవాలని అనుకునే వారికి తప్పకుండ పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ మే 07, 2022. దరఖాస్తు ఫీజు గురించి చూస్తే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు కి రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు కి రూ.50. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. శాలరీ విషయానికి వస్తే.. రూ 39,500 చెల్లించనున్నారు. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/1B315zg4Dzle_XwTwVxHutWX51VD73vjI/view లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news