వాహణదారులకు అలర్ట్ : రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

-

రేపు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. అయితే ఈ సారి ప్లీనరీ సమావేశాలను వైభవంగా జరుపుకోనున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్‌ శ్రేణులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

ప్లీనరీ జరగనున్న హెచ్ ఐ సి సి కొత్తగూడె-హైటెక్స్ తో పాటు సైబర్ టవర్స్-ఐకియ రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ టు కొత్తగూడ ప్రాంతం ఆఫీసుల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారి సూచన చేశారు.

రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని వివరించారు. నీరుష్ జంక్షన్ – సైబర్ టవర్స్ , జంక్షన్- మెటల్ చార్మినార్ జంక్షన్- గూగుల్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ రోడ్డు లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. మెటల్ చార్మినార్ జంక్షన్- కానా మేట జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ అధికంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news