Bigg Boss Telugu 3 Episode 16: ఈ హౌస్ లో ఉండలేనంటూ తనను తాను నామినేట్ చేసుకున్న పునర్నవి..!

-

ఇంటి సభ్యుల్లో ఎవరైనా ఇద్దరిని సరైన కారణం చెప్పి ప్రతి ఇంటి సభ్యుడు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేటెడ్ స్టాంప్ తీసుకెళ్లి.. తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ముఖం మీద కాని… చేతి మీద కానీ… స్టాంప్ వేయాలి.

బిగ్ బాస్ అప్పుడే 16 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. హౌస్ లో 15 వ రోజు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే సభ్యుడి కోసం నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే.. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్ నామినేషన్ ప్రక్రియను ఈసారి నిర్వహించారు.

అంటే.. ఇంటి సభ్యుల్లో ఎవరైనా ఇద్దరిని సరైన కారణం చెప్పి ప్రతి ఇంటి సభ్యుడు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేటెడ్ స్టాంప్ తీసుకెళ్లి.. తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ముఖం మీద కాని… చేతి మీద కానీ… స్టాంప్ వేయాలి.

అయితే.. మొన్న జాఫర్ పోతూపోతూ హౌస్ లో గ్రూప్స్ ఉన్నాయని చెప్పాడు కదా. నిజంగానే ఒక గ్రూప్ సభ్యులను టార్గెట్ చేస్తూ మరో గ్రూప్ సభ్యులు నామినేట్ చేశారు.

ఎక్కువ మంది మాత్రం తమన్నా బిహేవియర్ నచ్చక నామినేట్ చేశారు. మిగితా వాళ్లు మరో గ్రూప్ లోని సభ్యులు అనుకుంటున్న పునర్నవి, రాహుల్, వితిక లను టార్గెట్ చేశారు. కెప్టెన్ కాబట్టి వరుణ్ బతికిపోయాడు కానీ.. లేకపోతే వరుణ్ కే ఎక్కువగా నామినేషన్స్ వచ్చేవి.

మొత్తానికి ఈ వారంలో ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తమన్నా, పునర్నవి, రాహుల్, వితిక, బాబా భాస్కర్ నామినేషన్స్ లో ఉన్నారు.

నాకు ఈ హౌస్ నచ్చలేదు

అయితే.. నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా పునర్నవి కొంచెం భావోద్వేగానికి గురయింది. చాలామంది తనను నామినేట్ చేస్తూ… తను సరిగ్గా ఎవరితో కదలదు అంటూ చెప్పేసరికి.. నేను ఎంతగా అందరితో కనెక్ట్ అవుతున్నా కూడా ఇలా తనను టార్గెట్ చేయడం నచ్చలేదని పునర్నవి భావోద్వేగానికి గురై తనను తాను నామినేట్ చేసుకుంది.

అయితే.. బిగ్ బాస్ హౌస్ నియమాల ప్రకారం ఎవరిని వారు నామినేట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. లేదంటే ఇంటి సభ్యులంతా నామినేట్ కావాల్సి వస్తుందని… ప్రతి వారం పునర్నవి డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు నామినేట్ అవుతుందని బిగ్ బాస్ తెలియజేస్తాడు.

చివరకు కెప్టెన్ వరుణ్.. తనతో ప్రైవేట్ గా మాట్లాడి…. ఇద్దరిని నామినేట్ చేయాలంటూ కోరడంతో పునర్నవి కాస్త కూల్ అయి… శివజ్యోతి, బాబా భాస్కర్ ను నామినేట్ చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఎక్కువ ఓట్లు వచ్చిన తమన్నా, వితిక, పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్ ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోవడానికి నామినేట్ అయ్యారు.

రవిని టార్గెట్ చేసిన తమన్నా

తమన్నా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా… తమన్నా… రవిని టార్గెట్ చేసింది. రవి.. తనను నామినేట్ చేయడంతో తట్టుకోక తమన్నా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసింది. అది ఒక్క రవికే కాదు.. మిగితా సభ్యులను కూడా బాధించింది.

చూద్దాం… ఈ వారం ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారు, ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news