ఇదెక్కడి గోల : కరోన కాలంలో గ్రీన్ జోన్..ఇప్పుడేమో లాక్ డౌన్ ?

-

ఆంధ్ర ప్రదేశ్‌లో క‌రోనా క‌ల్లోలం రోజురోజుకీ పెరుగుతోంది. లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చిన అక్కడ కేసులను బట్టి లాక్ డౌన్ విధించే బాధ్యతను లోకల్ అధికారులకే అప్పగించారు. దీంతో స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అక్కడ లాక్‌డౌన్ విధిస్తున్నారు అధికారులు.. గుంటూరు జిల్లాలో మొదటి నుండి భారీ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతూ వ‌చ్చినా.. రేప‌ల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది..

కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది… కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో.. రేప‌ల్లెలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు స్థానిక అధికారులు.ఈ నెల 16వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుండి రేపల్లెలో సంపూర్ణ లాక్ డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. అధికారులు. ఉదయం 6 నుండి 9 గంట‌ల‌ వరకు మాత్రమే వ్యాపారాల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని అధికారులు. పేర్కొన్నారు. కరోనా కాలంలో గ్రీన్ జోన్‌గా ఉన్న రేప‌ల్లె.. ప్ర‌స్తుతం మరో సారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుండడం ఆశ్చర్యకరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news