తెలంగాణా కరోనా.. 2,479 కేసులు, 10 మరణాలు !

-

గత కొద్ది రోజులుగా మూడు వేలకి దగ్గరదగ్గరగా నమోదవుతున్న తెలంగాణా కరోనా కేసులు మళ్ళీ భారీగానే నమోదయ్యాయి. తాజాగా ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 2,479 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 10 మంది కరోనా వలన చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 916కు చేరింది.

ఇప్పటిదాకా కరోనా నుండి 1,15,072 మంది కోలుకోగా నిన్న ఒక్కరోజే 2,485 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 31,654 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 24,741 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 62,649 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 18,90,554కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 322 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 188 కేసులతో నిలిచింది

Read more RELATED
Recommended to you

Latest news