BREAKING : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కరోనా పంజా

-

దేశంలో కరోనా నెమ్మదిగా అదుపులోకి వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొవిడ్ వ్యాప్తి తగ్గినా.. ప్రజలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగానే ఉంది.

తాజాగా టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు కరోనా బారినపడ్డారు. తమకు కరోనా సోకిందని వారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గత కొద్ది రోజులుగా తమతో కాంటాక్ట్ లో ఉన్న వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే తమ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో  చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు కరోనాకు గురయ్యారని తెలుసుకున్న ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news