బీహార్ రైతు కేజీ రూ.1 ల‌క్ష ధ‌ర ప‌లికే పంట‌ను నిజంగానే వేశాడా ? నిజ‌మెంత ?

-

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో అస‌లు వార్త ఏదో, న‌కిలీ వార్త ఏదో న‌మ్మ‌లేక‌పోతున్నాం. కొన్ని వార్త‌ల‌ను నిజ‌మే అని న‌మ్మి పెద్ద పెద్ద మీడియా సంస్థ‌లు కూడా బోల్తా ప‌డుతున్నాయి. స‌రిగ్గా ఓ వార్త విష‌యంలోనూ తాజాగా ఇలాగే జ‌రిగింది. బీహార్‌కు చెందిన ఓ రైతు హాప్ షూట్స్ అనే పంట‌ను పండిస్తున్నాడ‌ని ఓ వార్త ఇటీవ‌లి కాలంలో వైర‌ల్ అయింది క‌దా. అయితే అదంతా వ‌ట్టిదేన‌ని తేలింది.

did bihar farmer really have crop of hop shoots fact check

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా క‌ర‌మ్‌దిహ్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల అమ్రేష్ సింగ్ హాప్ షూట్స్ అనే పంట‌ను పండిస్తున్నాడ‌ని, ఆ పంట కేజీ ధ‌ర రూ.1 ల‌క్ష‌ల‌కు అమ్ముడ‌వుతుంద‌ని ఒక వార్త ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది క‌దా. అయితే నిజానికి ఆ వార్త ఫేక్ అని తేలింది. ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఈ విష‌యమై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆ రైతు ఉన్న గ్రామానికి వెళ్లి విచార‌ణ చేసింది. ఈ క్ర‌మంలో అస‌లు అత‌ను గానీ, వేరే ఎవ‌రు గానీ ఆ గ్రామంలో, చుట్టు ప‌క్క‌ల ఎక్క‌డా ఆ పంట‌ను వేయ‌లేద‌ని వెల్ల‌డైంది. ఇదంతా బోగ‌స్ వార్త అని తేల్చారు.

నిజానికి ఈ వార్త‌ను పెద్ద పెద్ద మీడియా సంస్థ‌లు కూడా త‌మ ప‌త్రిక‌ల్లో, సైట్ల‌లో ప్ర‌చురించాయి. కానీ ఈ వార్త ఫేక్ కావ‌డంతో ఆయా సంస్థ‌లు మ‌ళ్లీ బోల్తా కొట్టాయి. గ‌తంలోనూ ప‌లు వార్త‌ల విష‌యంలో ఇలాగే జరిగింది. దీంతో అస‌లు వార్త ఏది, న‌కిలీ వార్త ఏది అని క‌నుక్కోవ‌డం మీడియా సంస్థ‌ల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారింది. అయితే ఆ పంట కేజీ ధ‌ర రూ.1 ల‌క్ష ప‌ల‌క‌డం వాస్త‌వ‌మే. కానీ దాన్ని ఆ రైతు మాత్రం వేయ‌లేదు. ఇది నిజం. ‌

Read more RELATED
Recommended to you

Latest news