మంత్రాల‌తో తానే చంపేశాన‌ని ఒప్పుకుని.. మ‌ళ్లీ బ‌తికిస్తాన‌ని ఏం చేశాడంటే..

-

ఇప్పుడున్న స‌మాజం అంతా కూడా అత్యంత అడ్వాన్సెడ్ టెక్నాల‌జీ వైపు దూసుకుపోతుంటే.. ఇంకా చాలా గ్రామాలు అయితే మూఢ న‌మ్మ‌కాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో చాలామంది మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగా దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇంకా కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు అక్క‌డ‌క్క‌డా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మంత్రాల నెపంతో ఓ వ్య‌క్తిని చిత‌క‌బాదిన ఘ‌ట‌నహ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే ఆ వ్య‌క్తి కూడా తానే మంత్రాల‌తో చంపేశాన‌ని ఒప్పుకున్నాడు.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కొత్త‌గా ఏర్పడ్డ జ‌గిత్యాల జిల్లాలో జ‌రిగిన ఈ దారుణ‌మైన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఇప్ప‌టికే జ‌రిగిన ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో మంత్రాల చేశాడ‌న్న వ్య‌క్తిని దారుణంగా కొట్ట‌డం లాంటిది జ‌రిగేది. కానీ ఇప్పుడు జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆ వ్య‌క్తి కాస్తా తానే చంపేశాన‌ని ఒప్పుకోవ‌డంతో పాటు చివ‌ర‌కు తానే బ‌తికిస్తానంటూ సంచ‌ల‌నం రేపాడు.

జగిత్యాల రూరల్‌ మండలం టీఆర్‌ నగర్‌లో నివ‌సిస్తున్న ఓర్సు రమేష్ అనూహ్యంగా చ‌నిపోవ‌డంతో ఆయ‌న్ను స్థానికంగా నివ‌సిస్తున్న పుల్లయ్య అనే వ్యక్తి మంత్రాలు చేశాడ‌ని కుటుంబీకులు తీవ్రంగా కొట్టారు. ఇక పుల్ల‌య్య కూడా తానే చంపిన‌ట్టు ఒప్పుకోవ‌డంతో పాటు తానే బ‌తికిస్తానంటూ శవం ద‌గ్గ‌ర ఉద‌యం నుంచి సాయంత్రం దాకా ఏవేవో పూజ‌లు చేస్తూ పెద్ద‌గా అరుస్తున్నాడు. ఇక ఈ విష‌యం కాస్తా పోలీసుల‌కు తెలిసి వారు వ‌చ్చి పుల్ల‌య్య‌ను అదుపులోకి తీసుకుని శ‌వానికి అంత్య క్రియ‌లు జ‌రిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news