అక్కడ పంపు కొడితే డ్రమ్ముల కొద్ది మద్యం..పోలీసుల ఎంట్రీతో..

-

ఎక్కడైనా కూడా పంపు కొడితే నీళ్ళు రావడం చుస్తాము..కానీ మద్యం రావడం ఎప్పుడైనా చూశారా..బహుశా అది సాధ్యం కాదు.. ఆ మధ్య కాలంలో ఏపీలోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆయిల్‌ లాంటి ద్రవం ఉద్భవించినట్టుగా వినిపించాయి.. ఇక్కడ మాత్రం హ్యాండ్ పంప్‌ను వాడిన ప్రజలకు బక్కెట్ల కొద్దీ మద్యం బయటకు వస్తుంది. అది చూసిన పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో వెలుగు చూసింది. ఈ రోజుల్లో రాష్ట్రంలో డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ, స్థానిక యంత్రాంగం వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నాయి.

ఇందుకు సంబంధించి పోలీసులు గుణలో దాడి చేయగా, వారికి ఒక చేతి పంపు దొరికింది. దాని నుండి నీరు కాదు, మద్యం బయటకు వస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అక్రమ మద్యం అమ్మకాల కోసం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఓ చేతి పంపును ఏర్పాటు చేసింది. పోలీసులు చేతి పంపును కోట్టి చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం రావటంతో ఖాకీలు కంగుతిన్నారు. అక్రమ మద్యం స్థావరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 6 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాన్‌పురాలో నిందితులు ట్యాంక్‌ను భూమిలో పాతిపెట్టి చేతి పంపును అమర్చారు. పోలీసులు చేతిపంపు కొట్టగానే అందులో నుంచి మద్యం రావడం మొదలైంది..

అయితే మధ్యప్రదేశ్ పోలీసులు పలు చోట్ల దాడులు నిర్వహించి దాడులు జరిపి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేద్దాం. అక్రమ మద్యం విక్రయిస్తున్న మాఫియాపై ఎంపీ పోలీసులు చర్యలు తీసుకోవడం ఇదేం మొదటి కేసు కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అనేక ప్రధాన దాడుల్లో వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం పెద్దఎత్తున సాగుతున్నట్లు పోలీసుల ఈ దాడితో స్పష్టమవుతోంది..మొత్తానికి ఇక్కడ ఉన్న మద్యం గురించి పోలీసులు కూపి లాగే పనిలో ఉన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news