కేజ్రివాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.. వీడియో

-

ఢిల్లీలోని మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కేజ్రివాల్. ప్రచార రథంపైన నిలబడి అందరికీ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు ప్రచార రథం ఎక్కి మరీ కేజ్రివాల్ చెంప చెల్లుమనిపించాడు.

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి నడుస్తోంది. ఇంకా మూడు విడుతల ఎన్నికల జరగాల్సి ఉంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే.. ఇవాళ్టి ఎన్నికల ప్రచారంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

ఢిల్లీలోని మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కేజ్రివాల్. ప్రచార రథంపైన నిలబడి అందరికీ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు ప్రచార రథం ఎక్కి మరీ కేజ్రివాల్ చెంప చెల్లుమనిపించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని కిందికి లాగిన ఆప్ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాదారు.

అయితే.. కేజ్రివాల్‌పై ఇలా దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు ఓసారి ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కార్యాలయంలోనే కేజ్రివాల్‌పై ఓ వ్యక్తి సిరాతో దాడి చేశాడు. అంతకుముందు కేజ్రీపై చెప్పు విసిరాడు ఇంకో వ్యక్తి. మరో వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. తమ ప్రాంతంలో మెట్రో విస్తరణ పనులు చేపట్టడం లేదని దాదాపు 100 మంది కేజ్రీ కారును అడ్డగించారు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో కేజ్రీ కారుపై దాడి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version