లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేశారని.. థియేటర్లు సీజ్..!

-

ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా షో వేశారని కడపలోని 3 థియేటర్లను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇక మీదట ఆ థియేటర్లు తెరుచుకోవడం కష్టమే అని తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో నిభంధనలు ఉల్లంఘించి సినిమా షో వేసినందుకు గాను ఎలక్షన్ కమీషన్ కొరడా ఝులిపించింది. మే 1న ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ కావాల్సి ఉన్నా ఎలక్షన్ కోడ్ నడుస్తున్న సందర్భంగా రిలీజ్ ను ఆపేశారు.

అదే టైంలో విజయవాడలో ఆర్జివి ప్రెస్ మీట్ పెట్టకుండా కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే నిబంధనలు అతిక్రమించి కడలోని రాజా, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర, రైల్వే కోడూరు లోని ఏ.ఎస్.ఆర్ థియేటర్ లను జెసి ఆదేశాల ప్రకారం రెవిన్యూ అధికారులు సీజ్ చేయడం జరిగింది. థియేటర్ బీ ఫాం లైసెన్స్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version