పౌడర్ తిని బ్రతుకుతున్న మహిళ, ఇదేం గోలరా బాబు…!

-

మనిషికో పిచ్చి ఉంటుంది, బట్టల విషయంలో, ఆహారం విషయంలో ఇష్టం వచ్చినట్టు ఉంటారు. బట్టల విషయ౦ ఏమో గాని తిండి విషయానికి వస్తే కొంత మందికి ఉండే వింత అలవాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల ఒక అమ్మాయి టీ మాత్రమే తాగి బ్రతుకుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక అమ్మాయి ఆఖలి వేస్తే గిన్నెలో ముఖాని రాసుకునే పౌడర్ స్పూన్ తో తింటుంది.

44 ఏళ్ల లిసా అండర్సన్ అనే మహిళ 2004లో తన పిల్లలకు టాల్కం పౌడర్ రాస్తూ.. ఆ వాసనకు ఎక్కువగా అలవాటు పడింది. ఆ తర్వాత ఆ రుచి తెలుసుకోవాలని చూసి, కాస్త నోట్లో వేసుకుంది. అది నచ్చడంతో,దాన్ని తినడం అలవాటు చేసుకుంది. క్రమంగా పౌడర్ కి బానిసగా మారింది. లంచ్ తిన్నా, తినకపోయినా.. మూడు పూటలా పౌడర్ తినడ౦ అలవాటు చేసుకుంది. మరి ప్రభావం ఉంటుంది కదండి,

రోజూ లూజ్ మోషన్స్‌తో 40 సార్లు విసర్జనకు వెళ్తోంది. తినడం కూడా కాస్త రేటు ఎక్కువగా ఉన్నవే తింటుంది. ఇప్పటివరకు ఆమె పౌడర్ కోసం రూ.7.5 లక్షలు ఖర్చుపెట్టింది. ఆమెకు ఐదుగురు పిల్లలు పుట్టినా ఆమె తింటుంది. అర్ధరాత్రులు కూడా అదే పని మీద ఉంటుంది. రోజుకు కనీసం 200 గ్రాముల ఫౌడర్ డబ్బా తింటుందని సమాచారం. దీనితో ఆమె వైద్యుల వద్దకు వెళ్ళగా ఆమె పికా సిండ్రోం ఉందని అందువల్ల తినడానికి పనికి రాని వస్తువులను తినాలనే కోరిక కలుగుతుందని వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version