రాములవారి కళ్యాణం ఎందుకు అంత ప్రత్యేకం…? దాని వెనుక కథ ఏంటో చూసేయండి మరి..!

-

హిందువులు జరుపుకునే ముఖ్యమైన వాటిల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి నాడు రామాలయం లో అంగరంగ వైభవంగా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసంలో శుద్ధ నవమి రోజున శ్రీ రాముల వారి కళ్యాణం జరుపుతారు. అతి వైభవంగా ఈ కళ్యాణాన్ని జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం రామయ్య ఆలయంలో, కడపలోని ఒంటిమిట్ట ఆలయంలో ముఖ్యంగా ఉత్సవాలను జరుపుతారు.

ఈ నేపథ్యంలో ఈసారి 30వ తేదీన రాములవారి కల్యాణోత్సవం జరగనుంది. దేవాలయ సిబ్బంది అని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఎందుకు స్పెషల్ గా సీతారాముల వారి కళ్యాణాన్ని జరుపుతారు దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని.. రాముడు సీత ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు.

యజ్ఞ ఫలితం ఆధారంగా జన్మించారు. పుత్ర సంతానం కోసం దశరాథ మహారాజు యాగం చేస్తారు. అప్పుడు శ్రీరాముడు జన్మించారు. యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా సీతమ్మ వచ్చారు. ‘రామ’ అనే నామాన్ని ఉచ్చరించడం ఎంతో మేలు కలుగుతుంది.
మన నోటి లోపల ఉండే పాపాలు అన్నీ కూడా పోతాయి. ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకుని పోతుందని పండితులు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news