ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి అనే చెప్పవచ్చు, ముఖ్యంగా యువతలో గుండె జబ్బులు అధికంగా కనిపిస్తున్నాయి. సరైన జీవనశైలి లేకపోవడం, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో గుండె ఆరోగ్యం పై ప్రభావం పడుతోంది. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలతో బాధపడుతున్నారని తేలింది, కనుక ఇటువంటి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.
ఫ్రెంచ్ ఫ్రైస్ ను నూనెలో వేయించి తయారు చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. బంగాళదుంపలను డీప్ ఫ్రై చేస్తే, అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి, దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఐస్ క్రీమ్ ను తరచుగా తీసుకుంటే, అది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇందులో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు షుగర్స్ గుండెపోటుకు దారి తీస్తాయి. అలాగే, పిజ్జాలో ఉన్న చీజ్, మాంసాహారం, ప్రాసెస్ చేసిన పదార్థాలు అనారోగ్యకరం. వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. వీటిలో షుగర్స్ మరియు కార్బోనేటెడ్ పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే, ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని వల్ల జీవ క్రియ దెబ్బతింటుంది అని నిపుణులు చెబుతున్నారు. కనుక కూల్ డ్రింక్స్ కు బదులుగా నిమ్మకాయ నీరు, పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవాలి. సహజంగా ప్రోటీన్ కోసం చికెన్ ను తీసుకుంటారు. కానీ నూనెలో వేయించిన చికెన్ ను అస్సలు తినకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కనుక, ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆహారంతో పాటుగా, వ్యాయామం చేయడం, సరైన నిద్రను పొందడం ఎంతో ముఖ్యం.