రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే ప్రయోజనాలు ఎన్నో…!

-

ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే రాగి పాత్రలు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం రాగి బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారు. రాగి బిందెలు, బాటిల్స్, గ్లాసులు ఇవన్నీ కామన్ అయిపోయాయి అనే చెప్పాలి. ఆయుర్వేదం ప్రకారం పరగడుపున రాగి పాత్ర లో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల కఫ, వాత పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. అంతే కాదు ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పుడే చూసేయండి… రాగి కొవ్వుని కరిగించి ఎఫెక్టివ్ గా ఎలిమినేట్ చేస్తుంది.

అలానే రాగి బిందె లో ఉన్న నీరు నాచురల్ గానే ప్యూరిఫై అయిపోతుంది. రాగి గుండె జబ్బుల రిస్క్ ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి, చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్ లెవెల్స్ ని కూడా తగ్గించడం లో ఇది సహాయ పడుతుంది. రాగిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటి ఎఫెక్ట్స్ ని తగ్గిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేసి హానికారక బ్యాక్టీరియాని నశింపచేసే గుణాలు కూడా రాగి లో ఉన్నాయి.

అల్సర్స్, ఇన్‌డైజెషన్, ఇన్‌ఫెక్షన్స్ వాంతి వాటి రెమెడీలా పని చేస్తుంది. బరువు త్వరగా తగ్గాలనుకునేవారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు తాగితే తగ్గుతారు. ఇది ఇమ్యూనిటీ ని స్ట్రెంతెన్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా కాపర్ లో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వల్ల బాధ పడేవారికి రిలీఫ్ గా ఉంటుంది. రాగి బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ప్రత్యేకించి ఈ.కోలీ వంటి బ్యాక్టీరియాని నిర్మూలించడంలో ఇది సహాయ పడుతుంది. చూసారా ఎన్నో నియోజనలో మరి మీరు కూడా ఈ విధంగా అనుసరిస్తే ఎన్నో సమస్యలకి చెక్ పెట్టొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news