కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ..!

-

మానవ శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవాలు మూత్రపిండాలు. ఇవి మానవ దేహంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర పోషించి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. మూత్ర పిండాలు పనితీరు తగ్గితే ఆరోగ్య సమస్యలు మొదలౌతాయి. అయితే ఇప్పుడు అన్ని రకాల కిడ్నీ సమస్యలకు వైద్యం అందుబాటులో ఉన్నాయి. అయినా మన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుని పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎప్పటికి మన కిడ్నీలును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలకు కారణం రక్తంలో సూక్ష్మ పోషకాలు పెరగడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తుంది. రక్తం లో నీరు చేరడం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ. మూత్ర పిండాలు సరిగా పని చేయక పోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటివి సంభవిస్తాయి. అందుకే ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.

తాజా పండ్లు, కాయకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటివి మన కిడ్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇంకా ఉప్పు, చక్కర, మాంసం వంటివి మూత్రపిండాలకు అనారోగ్యాలను కలుగ చేస్తాయి.నిమ్మ, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి  పైబర్ ఎక్కువగా ఉండే గుడ్లు, చిక్కుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు, కొత్తిమీర, అల్లం, దాల్చిన చెక్క, డార్క్ చాక్లెట్ లను వాడుకోవచ్చు. ముఖ్యంగా నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయ కూరలు తీసుకోవడం ద్వారా కిడ్నీలు  ఆరోగ్యంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news