పురుషుల బలాన్ని పెంచే ఎండు ద్రాక్ష, తేనె గురించి తెలుసుకోండి.

-

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. అవును, ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది.

ఎండు ద్రాక్ష తేనె పేస్టుని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక గాజు గ్లాసుని తీసుకుని అందులో 300గ్రాముల ఎండు ద్రాక్షని నింపండి. ఆ తర్వాత దానికి కొద్దిపాటి తేనెని కలపాలి. అంటే ఆ ద్రాక్షపై తేనెని పోయండి. అది పూర్తిగా కిందవరకు వెళ్లేదాకా వెయిట్ చేయండి. ద్రాక్షలు పూర్తిగా తేనెలో మునిగేంత వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దాన్ని 48గంటల పాటు పక్కన పెట్టండి. అంతే, ఎండుద్రాక్షతో చేసిన పేస్ట్ సిద్ధమై పోయింది. ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఎలా తినాలో చూద్దాం.

రోజూ పొద్దున్న లేవతానే ఖాళీ కడుపుతో మూడు నుండి నాలుగు ఎండు ద్రాక్షలని తినాలి. తినడానికి ముందు తిన్న తర్వాత అసలేమీ తినకూడదు. కనీసం నీళ్ళు కూడా తాగకూడదు. ఇలా కొన్ని రోజుల పాటు చేయాలి. అప్పుడు వీటివల్ల మగవాళ్లలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల సామర్థ్యం పెరిగి, సంతానోత్పత్తిలో ఇబ్బందులేమైనా ఉంటే దూరమయ్యే అవకాశం ఉంది. స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ఎండు ద్రాక్ష, తేనెతో కలిపిన పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news