ప్రమాదంలో కొడుకు మృతి.. మ‌ళ్లీ 52 ఏళ్ల వయసులో కవలలకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి..

-

ఆ దంపతులకు చాలా ఏళ్ల కిందటే సంతానం కలిగింది. అయితే మలివయసులో అండగా నిలవాల్సిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, పెళ్లి చేసి కుమార్తెను అత్తారింటికి పంపండంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ దంపతులు మళ్లీ పిల్లలు కావాలనుకున్నారు. ఈ క్ర‌మంలోనే కరీంనగర్‌లోని డాక్ట ర్‌ పద్మజ సంతానసాఫల్య కేంద్రం అండతో.. 52 ఏళ్ల వయసులో కూడా పండంటి కవలలకు జన్మనిచ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. భద్రాచలంకు చెందిన ఆరె సత్యనారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు వివాహం కాగా, కుమారుడు 2013లో 13 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయన ఆ దంపతులు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆ దంపతులు సంతానం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన రమాదేవి శుక్రవారం ఉదయం సాధారణ ప్రసవం ద్వారా ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version