టీడీపీకి మరో షాకిచ్చిన ఎన్నికల కమిషన్.. టీవీలో ‘యాత్ర’కు గ్రీన్ సిగ్నల్

-

యాత్ర సినిమా శాటిలైట్ రైట్స్‌ను సొంత చేసుకున్న స్టార్ మా తెలుగు చానెల్.. ఈ సినిమాను ఈ ఆదివారం(ఏప్రిల్ 7)న మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది.

అధికార టీడీపీ పార్టీ వైఎస్సార్సీపీని ప్రతి విషయంలోనూ అడ్డుకోవాలని చూస్తున్నది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నది. ఆ అడ్డదారుల వల్ల చంద్రబాబే అడ్డంగా బుక్కవుతూ వస్తున్నారు. టీవీల్లో ప్రసారం కానున్న యాత్ర సినిమాను కూడా అడ్డుకోవడానికి టీడీపీ నేతలు విఫల యత్నాలు చేశారు. కానీ.. వాళ్ల ప్రయత్నాలేవీ విజయం కాలేదు.

టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో యాత్ర సినిమా టీవీలో ప్రదర్శించడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. యాత్ర సినిమా శాటిలైట్ రైట్స్‌ను సొంత చేసుకున్న స్టార్ మా తెలుగు చానెల్.. ఈ సినిమాను ఈ ఆదివారం(ఏప్రిల్ 7)న మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి వసూళ్లను సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version