ఆ చెట్టు పాలు తాగితే రోగాలన్నీ మాయం..అవునా?

-

ఈ మధ్య కాలంలో వేప చెట్టుకు పాలు రావడం మనందరం చూస్తూనే ఉన్నాము..ఆ పాలు తాగితే దీర్ఘ కాలిక రోగాలు కూడా నయం అవుతాయని కొందరు అనడం కూడా విన్నాము..ఇలాంటి ఘటనలు దేవుడు మహిమ ద్వారానే జరుగుతాయని కొందరు బలంగా నమ్ముతారు..వాటిని తాగితే రోగాలు మాయమవుతాయని అంటున్నారు. భక్తిభావంతో కాలినడకన వెళ్లి కొబ్బరికాయ, పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు..

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా నిగాహిలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది..ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సింగరౌలీ జిల్లా నిగాహి గ్రామంలో శనివారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఓ వేపచెట్టు నుంచి పాలు ద్రవం రూపంలో కారడం మొదలయ్యాయి. అది చూసి భక్తులు ఇది షీత్లా మాత మహిమేనని చెబుతున్నారు. ఈ వేప చెట్టుకు చాలా సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నామని.. ఆ పాలు తాగితే రోగాలన్నీ మాయమవుతాయని అంటున్నారు.

మరోవైపు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయన్న విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు పాకింది. దీంతో దాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులకు అక్కడికి చేరుకొని.. పూజలు చేస్తున్నారు. ఈ వేప చెట్టు కింద ఇలాంటి అద్భుతాలు ఇదివరకే చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. అయితే, వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణం అని వృక్ష శాస్త్ర నిపుణులు అంటున్నారు.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై పగుళ్లతో పాటు పాల లాంటి ద్రవం వస్తుందంటున్నారు.. వేప చెట్టుకు సంబందించిన ఏవైనా తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది..అందుకే రోగాలు నయం అవుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news