సోలో క్యాంపెయినర్.. తన కోసం తానే స్కూటీపై ప్రచారం..!

-

ఆమె కోసం ఎవరూ ప్రచారం చేయరు. ఆమెకు ఆమె మాత్రమే ప్రచారం చేసుకోవాలి. ఆమె దగ్గర ప్రచారం చేయడానికి డబ్బు కూడా లేదు. కానీ.. తనను గెలిపించాలంటూ ఓ స్కూటీపై ప్రచారాన్ని మొదలు పెట్టింది మల్కాజ్‌గిరికి చెందిన ఓ మహిళ. ఆమె పేరు సుజాత కుమార్, మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రచారం చేయాలి కదా.. అందుకే.. తన దగ్గర డబ్బులు లేకున్నా.. ఎవరి సహాయం తీసుకోకుండా తనొక్కతే స్కూటీపై నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రచారం చేస్తోంది. నేను ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచి తీరుతారు. మల్కాజ్‌గిరికి మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికవుతా అంటూ తెలుపుతోంది. ఇంకా.. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే విందాం పదండి..


(Video Courtesy: Telangana Today)

Read more RELATED
Recommended to you

Exit mobile version