14న సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ చేయండి.. ఎందుకంటే..!

-

ఈ నెల 14న బాలల దినోత్సవం అన్న విష‌యం అంద‌ర‌కీ తెలిసిందే. అయితే ఈ చిల్ట్రన్స్ డే సందర్భంగా 14వ తేదీన తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి, పిల్లలతో ఆనందంగా గడపాలని, ఆహ్లాదంగా ఉండాలని తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్‌ పంపింది. 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తరఫున, సెల్‌ ఫోన్లను లేకుండా రోజంతా గడపాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేసింది.

ఈ క్ర‌మంలోనే ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సెల్‌ ఫోన్లను స్విచాఫ్‌ చేయాలని, రోజంతా పిల్లలతోనే ఉండాలని, కనీసం వారంలో ఒకసారి ఫోన్లను పక్కనబెడితే మరింత బాగుంటుందని అభిప్రాయపడింది. ఈ విషయంలో చిన్నారులే తల్లిదండ్రులపై ఒత్తిడి తేవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news