నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై తిరుమాడవీధుల ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహినీ అలంకారంతో స్వామివారు ఊరేగారు. చంద్రప్రభ వాహనంపై ఉన్న మలయప్పస్వామిని చూస్తే స్వామి చల్లగా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. దీంతో స్వామి వారి వైభవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవింద నామస్మరణలో తిరువీధులు మార్మోగాయి.
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు…
-
Previous article
Next article