దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో నేడు సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి దర్శనం కోసం దాదాపు 3లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో నేడు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు, వీఐపీ లైన్లు ఉండబోవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
నేడు దుర్గగుడికి సీఎం…
-
Previous article
Next article