జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘కవాతు’కి పాటను రచించిన రామజోగయ్య శాస్త్రికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పద పద పద పద మెరుపులా పద.. ఆ గగనం భువనం అదిరే మెరుపులా పద..’ అనే అద్భుతమైన పద సంపదతో పాటను రూపొందించగా…థమన్ బాణీలు అందించారు. త్వరలోనే పాటను విడుదల చేస్తామని పవన్ శనివారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘విపరీతమైన పని ఒత్తడిలో ఉండి కూడా.. మీ విలువైన సమయాన్ని కేటాయించి యువతకు మనోధైర్యం కలిగించే విధంగా మీ ఆలోచన స్ఫూర్తి చాలా ప్రస్ఫూటంగా పాట రచనలో కనిపించింది అంటూ పేర్కొన్నారు.
రామజోగయ్య శాస్త్రికి ధన్యవాదాలు.. చెప్పిన జనసేన అధినేత
-
Previous article
Next article