అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం సెజ్ వద్ద ఉద్రిక్తత…

-

నిన్న మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా లోని అచ్యుతాపురం సెజ్ లో ఉన్న సాహితీ ఫార్మా లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మూర్తి చెందగా, కొందరు గాయాల పాలయ్యారు. కాగా ఈ ప్రమాదంపై నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సాయం అందించి.. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సాహితీ ఫార్మా వద్ద నష్టపోయిన బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేస్తున్నారు. కాగా వీరు చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిన్ననే ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 25 లక్షలు నష్టపరిహారంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news