అమరావతిలో ఐటీ దాడులు

-

కొద్ది రోజులుగా తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఐటీ దాడులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. విజయవాడ, గుంటూరులోని పలు కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీ, విజయవాడలోని నారాయణ విద్యాసంస్థలు, సదరన్ కన్ స్ట్రక్షన్స్, తదితర కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తెదేపా నేతలు, వ్యాపార వేత్తలు, మంత్రుల బంధువుల ఇళ్లపై కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా స్థానిక పోలీసు కమిషనరేట్లకు ఐటీ శాఖ సమాచారం అందించినట్లు తెలుస్తుంది. టైం, ప్లేస్ చెబుతాం మాకు భద్రత కల్పించండి అంటూ ఐటీ అధికారులు వివరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news