అయోధ్యలో లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసిన బిగ్ బీ.. ధరెంతంటే..?!

-

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో అలనాటి నుంచి ఇప్పటి వరకూ సినిమాల్లోనూ, టీవీ షోల్లోనూ ఎంతగానో అలరించాడు. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎంక్లేవ్‌లో అమితాబ్ ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా వద్ద బిగ్ బీ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం . అయితే ప్లాట్ విస్తీర్ణం సుమారు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, దాని విలువ రూ.14.5 కోట్లు ఉండొచ్చని ఓ ఇంగ్లీష్ మీడియా వార్తా కథనం ప్రచురించింది.

అయోధ్యలో రామ మందిర ప్రారంభ రోజే సరయు నది ఒడ్డున 51 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ ఎంక్లేవ్ ను అమితాబచ్చన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.ఈ ఎంక్లేవ్ నుంచి రామాలయానికి 15 నిమిషాలు, అయోధ్య వాల్మికీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి 30 నిమిషాల్లో వెళ్ళ వచ్చు అని తెలుస్తోంది. 2028 మార్చికల్లా ఈ ఎంక్లేవ్ పూర్తి అవుతుందని రియాల్టీ డెవలపర్ చెబుతున్నారు.ఈ ఎంక్లేవ్‌లో నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని , నా హ్రుదయంలో అయోధ్య నగరానికి ప్రత్యేక స్థానం ఉంది అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్ బీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ అమితాబ్ బచ్చన్ జన్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news