కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట విషాదం..

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్క రాజుబెన్ సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకి కొన్ని నెలల క్రితమే లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకుంటారని తన కుటుంబ సభ్యులు భావించారు కానీ అనారోగ్యం క్షీణించడంతో ఆమె మరణించింది.

ఈ వార్త తెలిసిన వెంటనే మంత్రి అమిత్ షా గుజరాత్‌లో వర్చువల్‌గా జరగాల్సిన రెండు సమావేశాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజుబెన్ మరణించడంతో తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని అమిత్ షా నిర్ణయించుకున్నట్లు బిజెపి లీడర్స్ తెలిపారు. గాంధీనగర్ లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం,బనస్కాంత జిల్లా దేవదర్ లోని బనాస్ డెయిరీ ప్రారంభం రెండు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. బనస్కాంత కార్యక్రమానికి హాజరైన గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్ అమిత్ షా తన అక్కగారు చనిపోవడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. తర్వాత ఆమెకి నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news