ఇండియన్ సినిమాల దాటికి కనిపించకుండా పోతున్న హాలీవుడ్ మూవీ……

-

మరో మూడు నాలుగు రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ బాదుషా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకి సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కాబోతుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ వన్ : సీజ్ ఫైర్ ఈనెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ….ఇదివరకు రిలీజ్ డేట్స్ ను ప్రకటించినప్పుడు ఏదో ఒక హీరో వెనుకకి తగ్గుతారని చాలామంది అభిప్రాయపడ్డారు కానీ ఏ హీరో వెనక్కి తగ్గక పోవడంతో హీరో ప్రభాస్ మరియు షారుక్ ఖాన్ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటివరకు అయిన బుకింగ్స్ ను బట్టి చూస్తే కూడా ఇది స్పష్టం అవుతుంది.

ఇదిలా ఉండగా… ఈనెల 22వ తేదీన హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. అయితే ఇదివరకే రిలీజ్ అయిన ఆక్వామెన్ వన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మరియు షారుఖ్ ఖాన్ సినిమాల దెబ్బకి ఈ సినిమా ఎక్కడ కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే సలార్ మరియు డుంకీ సినిమాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version