ఎంపీగా గెలిచి తీరుతా..కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను 20 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉన్నానని, ఇప్పుడూ అదే కొనసాగిస్తానన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కోమటి రెడ్డి వివరించారు. ఈ విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించగా ఆయన అంగీకరించినట్లు వెల్లడించారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా నేతల సహాయంతో బరిలోకి దిగడం ఖాయమన్నారు. త్వరలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. గ్రామ స్థాయిలో అన్ని గ్రామాలకు నిధులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సి న అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news