కరోనా పేషెంట్స్ కి క్వాలిటీ లేని ఫుడ్.. కాంట్రాక్టర్ చెంప పగలకొట్టిన మంత్రి !

-

మహారాష్ట్ర అకోలాలోని ప్రభుత్వ వైద్య కళాశాల – ఆస్పత్రికి (జిఎంసిహెచ్) ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మహారాష్ట్ర మంత్రి బచ్చూ కడు చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది.  సోమవారం సాయంత్రం అకోలా జిల్లా మంత్రి అయిన కడు ఆసుపత్రికి సడన్ విజిట్ కోసం వచ్చారు, ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. ఫుడ్ కాంట్రాక్టర్‌ను కడు చెంపదెబ్బ కొడుతున్న ఒక వీడియో బయటపడింది. ఆసుపత్రి సందర్శనలో, కోవిడ్ -19 తో బాధపడుతున్న రోగులతో సహా మిగతా రోగులకు అందిస్తున్న భోజనాన్ని కడు పరిశీలించారు.

ఈ క్రమంలోనే ఆహార పదార్థాలు నాణ్యత లేనివిగా ఉన్నాయని తెలుసుకున్న ఆయనకు కోపం వచ్చింది. దీంతో ఆయన భోజన నాణ్యత మరియు ఇతర సమస్యలపై వివరణ కోరడానికి ఫుడ్ కాంట్రాక్టర్‌ను పిలిపించాడు, అయితే సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదని భావించి కడు ఆ కాంట్రాక్టర్ ను ని చెంపదెబ్బ కొట్టాడు. తరువాత, మీడియాతో మాట్లాడిన కడు, నాణ్యత లేని భోజనం, ఆహార సామాగ్రికి సంబంధించిన రికార్డులను నిర్వహించకపోవడంపై విచారణ జరపాలని జిల్లా సబ్ డివిజనల్ అధికారిని కోరినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news