కాంతార హీరో పై ప్రశంసల జల్లు…..

-

కాంతారా సినిమాతో ఒకేసారి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. కాంతారా ముందు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు కానీ ఈ సినిమాతో అతని రేంజ్ మారిపోయింది. చిన్న సినిమాగా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయినటువంటి కాంతారా ….ఏకంగా 400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ నటుడు ఒక నిర్ణయం తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తన స్వగ్రామమైన కేరడీ లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని రిషబ్ శెట్టి ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నాడు. గ్రామ పాఠశాలలు దత్తత తీసుకున్నటువంటి రిషబ్ శెట్టి పై గ్రామ నాయకులు మరియు పెద్దలు అభినందించారు.

దీంతో సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్లే వారికి మరింత గుర్తింపు మరియు ప్రతిష్ట వస్తుందని వారు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news