కాస్త ఉపశమనం కలిగించిన పెట్రో ధరలు…

-

కొన్ని రోజులుగా ఆకాశన్నంటుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్న పెట్రో ధరలు దసర సందర్భంగా కొద్దిగా తగ్గి ఉపశమనం కలిగించాయి. దేశ రాజధాని దిల్లీలో ఈరోజు పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.62 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.58గా నమోదైంది.. ముంబయి, చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో పెట్రోల్‌పై 21పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గాయి… ముంబయిలో పెట్రోల్‌పై 21పైసలు తగ్గడంతో లీటర్‌ ధర రూ.88.08గా ఉంది. ఇక కోల్‌కతాలో రూ.84.44, చెన్నైలో రూ.85.88గా ఉంది. డీజిల్‌ ధర ముంబయిలో రూ.79.35, కోల్‌కతాలో రూ.77.54, చెన్నైలో రూ.79.93కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news